Tue. Mar 28th, 2023

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటి పూట బడులు ఎప్పటి నుంచంటే?

ప్రస్తుతం తెలంగాణలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

రాత్రి చలి చంపేస్తుంటే.. పగలు మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడికి ప్రజలు ఇప్పుడే అవస్థలు పడుతున్నారు. మర్చి నాటికి ఎండలు మరింతగా విజృంభించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా స్కళ్లకు వెళ్లే చిన్నారులు ఎండతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒంటి పూట బడులకు సంబంధించి కూడా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలను వెల్లడించింది.

పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని మార్చి రెండో వారం నుంచి స్కూల్స్ సగం పూటే నడుస్తాయని తెలిపింది. మార్చి 15 నుంచే రాష్ట్రంలో ఒక్క పూట స్కూళ్లు ప్రారంభం అవుతాయని అధికార వర్గాల నుంచి సమాచారం.

ఈ హాఫ్ డే స్కూల్స్ టైంలో స్కూళ్లు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నడపనున్నారు. ఇదిలా ఉంటే.. సమ్మర్ హాలీడేస్ పై సైతం ఇప్పటికే విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించింది. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తిరిగి జూన్ 12న ప్రారంభం కానున్నాయి.

ఇంకా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమై.. 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మిగిలిన తరగతుల వారికి ఏప్రిల్ 12 నుంచి పరీక్షలను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

ఆ పరీక్షలు ఏప్రిల్ 20 వరకు కొనసాగనున్నాయి. పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 24న పెరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల పురోభివృద్ధిపై చర్చిస్తారు. తర్వాత 25వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి.